పోలీసు వాహనం ఢీకొన్న ఘటనలో చిన్నారి మృతి

పోలీసు వాహనం ఢీకొన్న ఘటనలో చిన్నారి మృతి
x
Highlights

పోలీసు వాహనం ఢీ కొని తీవ్ర గాయాలైన చిన్నారి ప్రణతి మృతి చెందింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రణతి...

పోలీసు వాహనం ఢీ కొని తీవ్ర గాయాలైన చిన్నారి ప్రణతి మృతి చెందింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రణతి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీసుల వాహనం మూడేళ్ల ప్రణతిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతికి తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రణతికి స్పెషల్ డాక్టర్ల టీమ్ చికిత్స అందించింది. మెరుగైన వైద్యం అందించడం కోసం రాచకొండ కమిషనర్ మహేశ్ భగవతి ప్రయత్నించారు. గుండె పని చేయకపోవడంతో చికిత్స పొందుంతూ ఇవాళ తెల్లవారుజామున ప్రణతి మృతి చెందింది. దీంతో ప్రణతి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రణతి మృతికి కారణమైన కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories