జనసేన పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. అయితే నిన్న ట్వీట్టర్...
జనసేన పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. అయితే నిన్న ట్వీట్టర్ వేదికగా లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేశారు. అయితే దీనికి విజయసాయి రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. అసలు విజయసాయిరెడ్డి తప్పుడు లెక్కల కారణంగా ఆయనతో పాటు చాలా మంది ఇరుక్కున్నారంటూ సెటైర్ సంధించారు. అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది ముమ్మాటికీ 65 సీట్లేనని కాస్తంత గట్టిగానే చెప్పేశారు విజయసాయిరెడ్డి. జేడీ గారూ జనసేనలో మీరేమీటో నాకు తెలియదు. నారా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చిన బీ పారాలు పోను జనసేనకు మిగిలింది 65 సీట్లేనని విజయసాయిరెడ్డి తన లెక్కేమిటో చెప్పేశారు. మరో పార్ట్నర్ కేఏ పాల్ బీ ఫారాలు పొగొట్టుకున్నట్టు గానే మీ పార్టీ అధినేత 80 సీట్లలో డమ్మీలను దింపి త్యాగం చేశారు. కాగా ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గరకు ట్యూషన్కు వెళ్లండి అని ట్వీట్ చేస్తూ జేడీకి విజయసాయిరెడ్డికి ఘాటు విమర్శ చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire