టీడీపీకి సోనియా గాంధీ మద్దతు

టీడీపీకి సోనియా గాంధీ మద్దతు
x
Highlights

లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస...

లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారు లేచి నిల్చోవాలని కోరారు. టీడీపీ ఎంపీలంతా తమ తమ స్థానాలలో లేచి నిలబడ్డారు. వారికి మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా నిల్చున్నారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు కూడా టీడీపీ తీర్మానాన్ని సమర్థిస్తూ లేచి నిలబడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం టీడీపీ తీర్మానానికి మద్దతిస్తూ లేచి నిలబడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories