పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు వీక్షించండి

పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు వీక్షించండి
x
Highlights

మే 23 కౌంటింగ్.. అంతా టీవీల ముందు వాలిపోతారు. ఆ రోజు పెళ్లికి ఎవరొస్తారో ఎవరు రారో అన్న టెన్షన్‌తో ఓ తండ్రి సరికొత్త ఆలోచనకు తెరలేపాడు. తన కుమార్తె...

మే 23 కౌంటింగ్.. అంతా టీవీల ముందు వాలిపోతారు. ఆ రోజు పెళ్లికి ఎవరొస్తారో ఎవరు రారో అన్న టెన్షన్‌తో ఓ తండ్రి సరికొత్త ఆలోచనకు తెరలేపాడు. తన కుమార్తె వివాహానికి రండి ఇక్కడే ఏర్పాటు చేసిన టీవీల్లో ఎంచక్కా ఎన్నికల ఫలితాల ప్రసారాన్ని చూడండి అంటూ పెళ్ళి ఆహ్వాన పత్రిక..శుభలేఖలో అచ్చు వేశారు. ఇప్పుడది అందర్నీ ఆకర్షిస్తోంది. మే 23న ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు భారీగా వివాహ శుభకార్యాలు జరగనున్నాయి. ఈ పెళ్లిళ్లకు వచ్చేవారు ఎన్నికల ఫలితాలు మిస్ కాకూడదన్న ఆలోచన తో వివాహ వేదికవద్ద ఏకంగా ఎలక్షన్స్ రిజల్స్ తెలుసుకునే ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తున్నారు పెళ్లి కుమార్తె తండ్రి.

నెల్లూరు లోని ప్రముఖ వస్త్ర వ్యాపారి భయ్యా వాసు. ఎన్నికల ఫలితాలరోజు బయ్యా వాసు కుమార్తె వివాహం ఉదయం 11.50గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అదే టైం లో పెళ్ళికి వచ్చిన వారికోసం లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. శుభలేఖలో 'పెళ్లికి రండి ఎన్నికల ఫలితాలను వీక్షించండి'అంటూ అచ్చేశారు. పెళ్ళి షెడ్యూల్ లో ప్రారంభం నుంచి తలపాక సెట్టింగ్‌లో వధూవరుల ప్రవేశం అప్సరసలచే ఆహ్వాన సంబరం.. ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం అంటూ శుభలేఖలో వెల్లడించి అందరికీ పంచారు. కళ్యాణ మండపంలోనే ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేశారు.

పెళ్లికార్డులో స్పెషల్ మాత్రమే కాదండీ మ్యారేజ్ కూడా ఓ రేంజ్ లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. వెండిపళ్ళాలు కళ్ళు చేదిరిపోయే సెట్టింగ్ లు మిరుమిట్లు గొలిపే కాంతులు అంతేస్తాయిలో సీటింగ్ ఒకటేమిటి పెళ్లంటే ఇలా అన్నట్లు వధువు తండ్రి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వతహాగా వస్త్ర వ్యాపారి కావడంతో తమ టెస్ట్ కి ఏమాత్రం తీసిపోకుండా పెళ్ళి జరపబోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories