టపాసులు నింపిన విషాదం.. 30మందికి పైగా..

టపాసులు నింపిన విషాదం.. 30మందికి పైగా..
x
Highlights

వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు ప్రమాదాలకు...

వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు ప్రమాదాలకు గురి చేశాయి. టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో టపాకాయలు కాలుస్తూ.. ప్రమాదానికి గురైన 30 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.. మరో ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మల్కాజిరిగిలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. అనుమతి లేకుండా టపాకాయలు అమ్ముతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్‌ జిల్లా ఉద్దేమర్రి గ్రామంలో ఇంటి ముందుకు దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం జరిగింది. పెట్రోల్ అమ్మకాలు సాగించే షాపు కావడంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

అటు ఏపీలోనూ దీపావళి సంబారాల్లో కొంతమంది గాయపడ్డారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా బాడంగి మండలంలో దీపావళి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడు గ్రామాల్లో బాంబులు పేలడంతో ముగ్గురికి చేతి వ్రేలు కట్టవ్వగా… నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపాలెంలో కూడా టపాసుల దాటికి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నల్లగర్ల బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories