బస్టాండ్‌లో లైవ్‌ ఎన్‌కౌంటర్‌...పట్టపగలే క్రిమినల్‌పై బుల్లెట్ల వర్షం

బస్టాండ్‌లో లైవ్‌ ఎన్‌కౌంటర్‌...పట్టపగలే క్రిమినల్‌పై బుల్లెట్ల వర్షం
x
Highlights

బీహార్‌లో సిని ఫక్కీలో ఎన్‌కౌంటర్ జరిగింది. నడిరోడ్డుపై పట్టపగలే అందరూ చూస్తుండగానే క్రిమినల్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు పోలీసులు. కరుడుగట్టిన...

బీహార్‌లో సిని ఫక్కీలో ఎన్‌కౌంటర్ జరిగింది. నడిరోడ్డుపై పట్టపగలే అందరూ చూస్తుండగానే క్రిమినల్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు పోలీసులు. కరుడుగట్టిన నేరస్తుడ్ని కాల్చి చంపారు. బీహార్ ముజఫర్‌పూర్ బస్టాండ్‌ సమీంపంలో చోటు చేసుకున్న లైవ్‌ ఎన్‌కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

నడిరోడ్డుపై ఆగి ఉన్న బస్సులో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాగి ఉంటడంతో చుట్టుపక్కల ప్రజలు చంపేయాలంటూ కేకలు పెట్టారు. దీంతో పోలీసులు బస్సు అద్దాల్ని పగులగొట్టి దుండగుడిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే నేరస్థుడ్ని మట్టుపెట్టారు. అంతకు ముందు పదిమంది నేరగాళ్లు బస్సులో ఉన్న కుందన్ సింగ్ అనే వ్యక్తి పై నాలుగురౌండ్లు కాల్పులు జరిపారు. సడెన్‌ బుల్లెట్ల సౌండ్‌ విని స్థానికులు భయంతో పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకోగానే క్రిమినల్స్‌ అందరూ పారిపోగా ఓ నేరస్థుడు మాత్రం బస్సులో ఉండిపోయాడు. దీంతో ఆ క్రిమినల్‌ను చంపేయాలంటూ జనం కేకలు పెట్టారు. దీంతో పోలీసులు ముందుగా క్రిమినల్‌ను లొంగిపోవాలని కోరగా అతడు పోలీసులపై కాల్పులకు దిగాడు. దీంతో క్రిమినల్‌పై కాల్పులు జరిపిన పోలీసులు అతడ్ని హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories