బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదని..

బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదని..
x
Highlights

ప్రైవేటు స్కూళ్లల్లో అరాచకాలు శృతిమించుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని కేకే రెడ్డి అనే ప్రైవేటు స్కూల్‌లో హాస్టల్‌ వార్డెన్‌ ఏకంగా...

ప్రైవేటు స్కూళ్లల్లో అరాచకాలు శృతిమించుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని కేకే రెడ్డి అనే ప్రైవేటు స్కూల్‌లో హాస్టల్‌ వార్డెన్‌ ఏకంగా 130 మంది విద్యార్థులను చితక్కొట్టాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా చేతులు, కాళ్లపై కట్టెలు విరిగేలా కొట్టారు. వార్డెన్‌ కొట్టిన దెబ్బలకు తాళలేక చాలామంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

నిన్న రాత్రి పిల్లలు బాత్రూమ్‌కు వెళ్లి నీళ్లు పోయకుండా వచ్చారు. ఈ ఉదయం విషయాన్ని గమనించిన వార్డెన్‌ రవీందర్‌ కోపం పట్టలేక కట్టెలతో పిల్లలను గొడ్డును బాదినట్లు బాదాడు. 130 మంది విద్యార్థుల్లో 37 మంది స్టూడెంట్స్‌కు తీవ్ర గాయాలు కాగా వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇటు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువులు చెప్పుమంటే చితక్కొడతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను తామే ఎన్నడు కొట్టలేదని రక్తాలు కారేలా మీరెలా కొడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories