తిరుమలలో భక్తులతో కలసి భోజనం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తిరుమలలో భక్తులతో కలసి భోజనం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
x
Highlights

తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తిరుమల లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్న ప్రసాద్ భవనంలో భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు...

తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తిరుమల లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్న ప్రసాద్ భవనంలో భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు. అంతకు మునుపు వేద పాఠశాల సందర్శించి తిరిగి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ భవనం చేరుకున్న ఉప రాష్ట్రపతి కి టిటిడి జేఈవో శ్రీనివాస్ రాజు స్వాగతం పలికి అన్నప్రసాద్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. సామాన్య భక్తులకు మాదిరిగా వరసలో కూర్చుగా ఉప రాష్ట్రపతి సతీమణి ఉషమ్మ గారు శ్రీవారి సేవ కురాలుగా ఉప రాష్ట్రపతి గారికి భోజనం వడ్డించారు.అనంతరం ఉప రాష్ట్రపతి భోజనం చేస్తున్న భక్తులకు అభివాదం చేస్తు ఆప్యాయంగా పలకరించారు.

ఉప రాష్ట్రపతి వెంట కుటుంబ సభ్యులు మరియు బంధువులు, బిజెపి నాయుడు బాను ప్రకాష్ రెడ్డి, అర్బన్ పోలీసు జిల్లా యస్ పి.అన్బు రాజన్,అన్నప్రసాద్ కేంద్రం ఇన్ చార్జీ శాస్ర్తీ, టిటిడి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories