120 స్థానాల్లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ: టీడీపీ మంత్రి

120 స్థానాల్లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ: టీడీపీ మంత్రి
x
Highlights

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 120 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇక భారతదేశానికి...

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 120 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇక భారతదేశానికి కొత్త నాయకత్వం వస్తుందని, ఇప్పుడు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిబాట పట్టడం ఖాయమని కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో అల్లర్లు సృష్టించాలని చూశారని కొల్లు తెలిపారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఈసీ ఎక్కువ సమయం పడుతుందనడం నిజంగా విడ్డూరంగా ఉందని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. బ్యాలెట్ ఓటింగ్ జరిగినప్పుడే 24 గంటల్లో ఫలితాలు వచ్చేవని అన్నారు. ఇక వైసీపీ మైండ్‌గేమ్‌తో అధికారులను భయపెడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు అధికారుల అండతో కమీషన్లు దండుకోవాలని చూస్తున్నారని కొల్లురవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.





Show Full Article
Print Article
Next Story
More Stories