మోడీకి పాదాభివందనం చేయబోయిన ఏపీ సీఎం జగన్

మోడీకి పాదాభివందనం చేయబోయిన ఏపీ సీఎం జగన్
x
Highlights

ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తిరుమల వెంకన్న దర్శనం, తిరుపతిలో బహిరంగ సభ కార్యక్రమాల కోసం కొలంబో నుంచి నేరుగా రేణిగుంట...



ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తిరుమల వెంకన్న దర్శనం, తిరుపతిలో బహిరంగ సభ కార్యక్రమాల కోసం కొలంబో నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, వైసీపీ నేతలూ స్వాగతం పలికారు. గవర్నర్ మోడీకి ఓ పువ్వు ఇచ్చి స్వాగతం పలికారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ కూడా ఒక పువ్వు మోడీకి అందచేశారు. ఈ సందర్భంగా మోడీ కాళ్ళకు నమస్కారం చేయడానికి జగన్ ప్రయత్నించారు. అయితే, ప్రధాని మోడీ వద్దని వారించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం చెప్పడానికి వచ్చిన వైసీపీ నేతలను ఆయనకు పరిచయం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories