ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్

ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్
x
Highlights

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా...

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు,ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా తెలంగాణాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. మాజీ కేంద్రమంత్రి జేడీ శీలంను కూడా ఏఐసీసీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కు అనుసంధానించారు. ఇక ఏపీకి తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మయ్యప్పన్ లను ఏఐసీసీ కార్యదర్శి పదవులు వరించాయి. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషీని నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories