ప్రజాశక్తి కాకినాడ విలేకరిపై హత్యాయత్నం

ప్రజాశక్తి కాకినాడ విలేకరిపై హత్యాయత్నం
x
Highlights

ప్రజాశక్తి కాకినాడ విలేకరిగా పనిచేస్తున్న గురాల చిరంజీవి కుమార్ పై హత్యాయత్నం జరిగింది.బందువులు,పోలీసుల కధనం ప్రకారం కాకినాడ పల్లంరాజు నగర్లో నివాసం...

ప్రజాశక్తి కాకినాడ విలేకరిగా పనిచేస్తున్న గురాల చిరంజీవి కుమార్ పై హత్యాయత్నం జరిగింది.బందువులు,పోలీసుల కధనం ప్రకారం కాకినాడ పల్లంరాజు నగర్లో నివాసం ఉంటున్న చిరంజీవిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని ఐదుగురు దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి ఇష్టానుసారంగా దాడికి దిగారు. బీరు సీసాలతో పొడవబోయారు.వారినుండి తప్పించుకునే ప్రయత్నంలో విలేకరి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.ప్రాణ భయంతో పరుగురులు పెట్టిన బాధితుడుని వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు.వెంటనే స్థానికులు గమనించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు పరారయ్యారు.వెంటనే చిరంజీవిని కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. ముఖంపై 7 కుట్లు పడ్డాయి.ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు కాకినాడ డిఎస్పీ రవి వర్మ ఆసుపత్రికి వచ్చి బాదితుడి నుండి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించారు.కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు.1,2 వ పట్టణ సీఐలు రవి కుమార్,మురళీ, ఎస్ఐలు రమేష్ బాబు,ఏసుబాబు,కృష్ణమాచార్యులు,సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories