హర్యానా అమ్మాయితో తెలుగు అబ్బాయికి ఇక ముడి

హర్యానా అమ్మాయితో తెలుగు అబ్బాయికి ఇక ముడి
x
Highlights

భారత బ్యాడ్మింటన్ జోడీ, గత పదిసంవత్సరాలుగా ప్రేమికులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ ఇద్దరు చాంపియన్ల...

భారత బ్యాడ్మింటన్ జోడీ, గత పదిసంవత్సరాలుగా ప్రేమికులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ ఇద్దరు చాంపియన్ల జోడీ డిసెంబర్ 16 న ఒక్కటి కావాలని నిర్ణయించారు. హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారుపల్లి కశ్యప్ జూనియర్ స్థాయి నుంచి బ్యాడ్మింటన్ ఆడుతూ వస్తున్నారు. ఈ ఇద్దరికీ కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల, మహిళలసింగిల్స్ లో స్వర్ణ పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ఇద్దరూ గత దశాబ్దకాలంగా ప్రేమలో ఉన్నా ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతోనే పెళ్లికి సిద్ధమయ్యారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లుగా తమతమ లక్ష్యాలను సాధించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని గతంలోనే నిర్ణయించారు. మొత్తం మీద పదేళ్ల నిరీక్షణ తర్వాత పెళ్లి కల నిజంకాబోతోంది. కేవలం వందమంది ముఖ్యఅతిథుల సమక్షంలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. ఏదిఏమైనా 20 మేజర్ టైటిల్స్ విజేత సైనా కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ల లవ్ గేమ్ కు వివాహంతో శుభంకార్డు పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories