బీజేపీకి షాక్...37 మంది నేతల మూకుమ్మడి రాజీనామా

బీజేపీకి షాక్...37 మంది నేతల మూకుమ్మడి రాజీనామా
x
Highlights

లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ జనతపార్టీకి గట్టి ఎదుదెబ్బ తగిలింది. ఏకంగా 37 మంది బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సూత్రాలు, సిద్ధాంతాలు...

లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ జనతపార్టీకి గట్టి ఎదుదెబ్బ తగిలింది. ఏకంగా 37 మంది బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సూత్రాలు, సిద్ధాంతాలు నచ్చక తాము పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా 'హిందుత్వ' వ్యవహారంపై పార్టీ తీరుతో పాటు బీజేపీ సంస్థాగత కార్యదర్శి అనంత్ మిశ్రా వ్యవహారం కూడా అభ్యంతరకరంగా ఉందని వాళ్లు విమర్శిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇక రాజీనామా లేఖను నాగాలాండ్ బీజేపీ నాయకత్వంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపించారు. నాగాలాండ్ ప్రజల శ్రేయస్సును కోరే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ తీరుపై నాగాలాండ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వాళ్లు ఆరోపించారు. ఈ వ్యవహారం ఎటూ తేల్చకపోవడంతో తాము తీవ్ర నిరాశతో ఉన్నామని ఆ లేఖలో తేల్చి చెప్పారు. దాదాపు ఎనిమిది అంశాలపై పార్టీ వ్యవహరిస్తోన్న తీరును నిరసిస్తూ వారు పార్టీకి రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories