మనసు మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

మనసు మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?
x
Highlights

అభిమానులంతా ఇప్పటికే ఆలస్యం అయింది అని బాధ పడుతున్న తరుణం లో వారిని ఊరట పరచడానికి బన్నీ తన తదుపరి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభం చేసాడు. ఈ సినిమా కి...

అభిమానులంతా ఇప్పటికే ఆలస్యం అయింది అని బాధ పడుతున్న తరుణం లో వారిని ఊరట పరచడానికి బన్నీ తన తదుపరి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభం చేసాడు. ఈ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు ముగియగా, షూటింగ్ మరి కొద్దీ రోజుల్లో మొదలు కానుంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత మూడో సారి బన్నీ త్రివిక్రమ్ తో చేతులు కలపడం తో ఈ సినిమా పైన ఆశలు భారీ గా నే ఉన్నాయి అని చెప్పచు. గత కొద్దీ కాలంగా ఈ సినిమా మీద అనేకానేక పుకార్లు చక్కర్లు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా లో తండ్రి సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది అని, తండ్రి కొడుకుల సంబంధాన్ని సరికొత్త కోణం లో త్రివిక్రమ్ ఆవిష్కరించనున్నారు అని వార్తలు చాలా నే వచ్చాయి. అయితే త్రివిక్రమ్ గతంలో తీసిన అరవింద సామెత, సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి లో కూడా ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువ నే దట్టించాడు. ఈ పుకార్లు విన్న జనాలు మళ్ళి త్రివిక్రమ్ రొటీన్ పంథా లో వెళ్తున్నాడా అనే వ్యాఖ్యలు చేశారు కూడా. వీటిని అన్నిటినీ తెలుసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడు అట. కథ లో తండ్రి కొడుకుల థీమ్ ని తగ్గించి మంచి కమర్షియల్ హంగులు అద్దుతున్నాడట. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా కి కూడా నాన్న-నేను కాకుండా వేరే టైటిల్ పెట్టె యోచన లో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories