ప్రత్యేక హోదాను ఉరి తీసిన ఘనుడు చంద్రబాబు: రోజా

Highlights

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తానననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏప్రిల్ 30 వ తేదీన రాష్ట్ర ప్రజలను ఫూల్స్ ను...

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తానననడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏప్రిల్ 30 వ తేదీన రాష్ట్ర ప్రజలను ఫూల్స్ ను చేయడానికే టిడిపి డ్రామాలకు పూనుకున్నారన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబును నమ్మక ద్రోహి అనడంలో ఎంతమాత్రం తప్పులేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఎంత అన్యాయం చేసిందో, అంతకు నాలుగు రెట్లు అధికంగా చంద్రబాబు ద్రోహం చేశారన్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, టిడిపి వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. హోదా పదేళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని చెప్పి నాలుగేళ్లపాటు దానిని మరచిపోయారని, మరిచిపోయినట్లు నటించారన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించకుండా వంచించిన వారిని నమ్మక ద్రోహం కాదా అని, అందుకు వారిని నమ్మక ద్రోహులు అనాలా వద్దా చెప్పాలని అడిగారు.
హోదా కోసం పోరాడిన వైయస్ ఆర్ కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులుపెట్టి ఉద్యమాన్ని అణగ దొక్కాలని చూసి, ఇప్పుడు ధర్మ పోరాటమంటూ డ్రామాలు చేయడం నీచమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories