పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డ జగన్..

పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డ జగన్..
x
Highlights

ప్రకాశం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు హీట్ ను రాజేశాయి. ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోడల్లుడు దగ్గుబాటి...

ప్రకాశం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు హీట్ ను రాజేశాయి. ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటిచారు. దాంతో తెలుగుదేశం పార్టీ నేతలు దగ్గుబాటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీని చేర్చుకోవద్దంటూ పర్చూరు వైసీపీ నేతలు పార్టీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ఇంచార్జ్ రావి రామనాధంబాబుకే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని తీర్మానం కూడా చేస్తున్నారు. దాంతో విషయం కాస్త అధిష్టానం పెద్దలకు తెలిసింది.

వెంటనే రంగంలోకి దిగిన సీనియర్ నేతలు పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. పార్టీ పటిష్ఠతకు అందరూ కలిసిరావాలని.. దగ్గుబాటి లాంటి నేతలను చేర్చుకోవడం వలన పార్టీ మరింత బలపడుతుందని వారితో చెప్పారు. అయినా కూడా కొందరు నేతలు వినక పోవడంతో.. నేరుగా జగనే రంగంలోకి దిగాలని చూస్తున్నట్టు టాక్ వినబడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories