పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం జగన్‌..

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం జగన్‌..
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి...

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వెళ్లనున్నారు. 10.30 గంటలకు కోట్ల ఫంక్షన్ హాల్‌లో జరిగే ఓ వివాహ వేడుకల్లో పాల్గొనున్నారు. తర్వాత 11.20 గంటలకు ఉండి నుంచి హెలికాప్టర్‌లో పోలవరం చేరుకోనున్నారు. 11.30 గంటల నుంచి 2 గంటల వరకు జగన్ పోలవరం డ్యామ్ పరిశీలనతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ప్రాజెక్టు వద్ద కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌వే నిర్మాణాలను సీఎం జగన్‌ పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం డ్యామ్‌ వద్దే అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories