వేల కోట్ల దోపిడీకి పవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూస్తున్నారు : రేవంత్‌

వేల కోట్ల దోపిడీకి పవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూస్తున్నారు : రేవంత్‌
x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ కలవడంపై స్పందించిన రేవంత్.....

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ కలవడంపై స్పందించిన రేవంత్.. కేసీఆర్ మాయలో పవన్‌కల్యాన్ పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు మేలు చేయడానికే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని రేవంత్ అన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో సాగే వేల కోట్ల దోపిడీకి పవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories