సుకుమార్ ను సిగ్గుపడేలా చేసిన వ్యక్తి ఎవరు?

సుకుమార్ ను సిగ్గుపడేలా చేసిన వ్యక్తి ఎవరు?
x
Highlights

వెర్సటైల్ దర్శకుడు సుకుమార్ నే సిగ్గుపడేలా చేశారట ఓ వ్యక్తి. రంగస్థలం సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సుక్కూ గుర్తు చేసుకున్నాడు....

వెర్సటైల్ దర్శకుడు సుకుమార్ నే సిగ్గుపడేలా చేశారట ఓ వ్యక్తి. రంగస్థలం సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సుక్కూ గుర్తు చేసుకున్నాడు. మామూలుగా.. సుకుమార్ చేసే సినిమాలన్నీ స్టయిలిష్ గా, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఇదే విషయాన్ని సుకుమార్ తో ఓ వ్యక్తి ప్రస్తావించారట. వన్ నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో సినిమాలు చేసే సమయంలో తాను అమెరికాకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు సుకుమార్ చెప్పాడు.

తన సినిమాలను ప్రశంసిస్తూనే.. ఆ వ్యక్తి గ్రామీణ నేపథ్యంలో సినిమా తీయొచ్చు కదా.. మన సంస్కృతి నేపథ్యంలో సినిమా తీయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారట. దీంతో.. తాను సిగ్గుపడాల్సి వచ్చిందని.. ఇప్పుడు రంగస్థలం సినిమాతో ఆ లోటు తీరిందని సుకుమార్ చెప్పుకొచ్చాడు. తాను 28 ఏళ్లు పల్లె వాతావరణంలోనే పెరిగాననీ.. రంగస్థలం.. ఆ అనుబంధాన్ని మరోసారి దగ్గర చేసిందనీ ఆనందం వ్యక్తం చేశాడు సుక్కూ.

ఇక.. సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే 2 పాటలను యూ ట్యూబ్ లో విడుదల చేయగా.. మిగిలినవాటిని డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసినట్టు సుకుమార్ చెప్పాడు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక.. 1980 నాటి సెట్స్ ను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అద్భుతంగా వేశారనీ.. సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం కూడా ఉందనీ అన్నాడు. ఇలా.. సినిమా గురించి చెబుతూనే.. తన మనసును తాకిన సందర్భాన్ని కూడా పంచుకున్నాడు సుకుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories