ఇవాళ వైసీపీఎల్పీ సమావేశం...

ఇవాళ వైసీపీఎల్పీ సమావేశం...
x
Highlights

టీమ్‌ జగన్‌.. ఎలా ఉండబోతోంది..? ఇప్పటికే బెర్తులు ఖరారయ్యాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎవరెవరికి అమాత్యయోగం పట్టనుంది..? జాబితాలో ఎంతమందికి అవకాశం...

టీమ్‌ జగన్‌.. ఎలా ఉండబోతోంది..? ఇప్పటికే బెర్తులు ఖరారయ్యాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎవరెవరికి అమాత్యయోగం పట్టనుంది..? జాబితాలో ఎంతమందికి అవకాశం ఉంది..? కాసేపట్లో జరగనున్న వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్‌ చేసే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ---

కాసేపట్లో జరిగే వైసీపీఎల్పీ సమావేశంలో.. మంత్రుల ఎంపికపై జగన్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన మంత్రులుగా ఎంపిక చేసింది ఎమ్మెల్యేలకు వివరిస్తారు. ముఖ్యంగా సామాజిక వర్గాలు, జిల్లాలు, సీనియర్ల వంటి అంశాల ఆధారంగా.. మంత్రివర్గ కూర్పు ఉంటుందని తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగా.. విజయనగరం జల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీ వాణి కి అవకాశం ఉండగా.. విశాఖపట్నం జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్‌, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి.. పిల్లి సుభాష్ చంద్ర బోస్, దాడిశెట్టి రాజుకు అవకాశం దక్కినట్లు చెబుతున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముదునూరి ప్రసాద రాజుకు బెర్త్‌ కన్ఫర్మ్‌ అయినట్లు తెలుస్తోంది.

కృష్టా జిల్లా నుంచి కొడాలి నాని, గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సుచరితకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రకాశం నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి, కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కడప నుంచి అంజాద్ పాషా, అనంతపురం నుంచి అనంత వెంకట రామిరెడ్డికి జగన్‌ తన డ్రీమ్‌టీమ్‌లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories