బస్సు చోరీపై మంత్రి సీరియస్

బస్సు చోరీపై మంత్రి సీరియస్
x
Highlights

హైదరాబాద్‌ కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు‌ను ఎత్తుకెళ్లడాన్ని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు....

హైదరాబాద్‌ కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు‌ను ఎత్తుకెళ్లడాన్ని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి బస్సు చోరీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన ప్రశాంత్‌రెడ్డి బస్సు ఎక్కడ ఉందో త్వరగా గుర్తించాలని ఆదేశించారు. బస్సు డిపోల్లో భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories