చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ యూటర్న్..: వైసీపీ నేత వ్యాఖ్యలు

చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ యూటర్న్..: వైసీపీ నేత వ్యాఖ్యలు
x
Highlights

ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి రోజు పంచ్‌ డైలాగులతో ఫైనల్ టచ్ ఇచ్చారు. లాస్ట్‌ డే క్యాంపైనింగ్‌లో అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తూ మెరుపులు...

ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి రోజు పంచ్‌ డైలాగులతో ఫైనల్ టచ్ ఇచ్చారు. లాస్ట్‌ డే క్యాంపైనింగ్‌లో అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తూ మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నారా చంద్రబాబు నాయుడే టార్గెట్ గా విమర్శలు కురిపించాడు. ఈ ఎన్నికల్లో పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే చంద్రబాబునాయుడు మళ్లీ యూటర్న్ తీసుకుంటారని బొత్స ఆరోపించారు. ఇక దాని వల్ల ఏపీ రాష్ట్రం ఎప్పటికి కోలుకోలేదని తేల్చిచెప్పారు. నారా చంద్రబాబు దోపిడీ పరుడని, ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఎన్నికల కోసం రైతులను మభ్యపెడుతున్నారని బొత్స అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావలంటే ఒక్క వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. గత 2014లో నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు జోడీ అని వచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు జోడీగా వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని బొత్స సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories