వైసీపీలో జోరందుకున్న చేరికలు

వైసీపీలో జోరందుకున్న చేరికలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాకినాడ ఎంపి తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి, విజయవాడ మాజీ...

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాకినాడ ఎంపి తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి, విజయవాడ మాజీ మేయర్ రత్న బిందు,పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్, సినీ నటుడు రాజా రవీంద్ర సహా పలువురు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికి జగన్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏపీ అభివృద్ధిపై వైసీపీ అధినేత జగన్ కు మాత్రమే ఓ విజన్ ఉందన్నారు సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్టూరి వరప్రసాద్. విజయవాడ ప్రాంతంలో రాజధాని లేని సమయంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధిని చూపిస్తానని చెప్పారు పొట్లూరి. జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మాజీ మేయర్ రత్నబిందు. జగన్ పాదయాత్ర స్పూర్తిగా వైసీపీలో చేరినట్లు చెప్పారు.








Show Full Article
Print Article
Next Story
More Stories