చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి తీరని నష్టం: కేవీపీ

చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి తీరని నష్టం: కేవీపీ
x
Highlights

పోలవరం నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు వైఖరి వల్ల ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. స్వార్థ ప్రయోజనాల కోసం...

పోలవరం నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు వైఖరి వల్ల ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్రానికి ద్రోహం చేశారని చెప్పారు. పోలవరం నిర్మాణం తన చేతుల్లోకి వస్తే వచ్చే లాభాన్ని గుర్తు తెచ్చుకుని కేంద్రం చెప్పినదానికల్లా చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతూ తాను లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన మొత్తం 55వేల 549 కోట్లల్లో కేంద్రం 27,082 కోట్లు మాత్రమే ఇస్తుందని, మిగిలిన 28,467 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని, ఇది రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదని ఆయన సీఎంను ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories