50 సంవ‌త్స‌రాల క్రితం క‌థ‌తో ప్ర‌భాస్‌

50 సంవ‌త్స‌రాల క్రితం క‌థ‌తో ప్ర‌భాస్‌
x
Highlights

'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' చిత్రాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'సాహో' అనే త్రిభాషా చిత్రంలో...

'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' చిత్రాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'సాహో' అనే త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, నీల్ నితేష్ ముఖ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, లాల్ వంటి భారీ తారాగ‌ణంతో తెలుగు, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇదిలా ఉంటే.. 'సాహో' త‌రువాత 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది. అదేమిటంటే.. 1960, 70 నాటి ప్రేమ‌క‌థ చిత్రంగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని, యూరప్ నేప‌థ్యంలో ఈ మూవీ ఉంటుంద‌ని తెలిసింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీత‌మందించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories