అధికారితో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే

అధికారితో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే
x
Highlights

రోడ్డు సరిగా వేయలేదని ఒడిషాలోని బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ మెహెర్ పీడబ్ల్యూడీ ఇంజినీర్‌ను గుంజీలు తీయించారు. సరోజ్ కుమార్ తన నియోజకవర్గంలో...

రోడ్డు సరిగా వేయలేదని ఒడిషాలోని బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ మెహెర్ పీడబ్ల్యూడీ ఇంజినీర్‌ను గుంజీలు తీయించారు. సరోజ్ కుమార్ తన నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఓ ప్రాంతంలో వేసిన రహదారిలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని సదరు ఇంజినీర్ ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రోడ్డు సరిగా వేయనందుకు 100 గుంజీలు తీయాలని ఇంజినీర్ ను ఆదేశించారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇంజినీర్ ను హెచ్చరించారు. దీంతో హడలెత్తిపోయిన ఇంజినీర్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ ముందు గుంజీలు తీశాడు. ఈ వీడియో ఇపుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరోజ్ కుమార్ మెహెర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories