పూనమ్ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి..?

పూనమ్ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి..?
x
Highlights

ఎవరి గురించి మాట్లాడిందో తెలియదుగానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలనే చేసింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం...

ఎవరి గురించి మాట్లాడిందో తెలియదుగానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలనే చేసింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ప్రశ్నించింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వ‌ల్ల క‌త్తి మ‌హేష్‌.. అత‌ని వ‌ల్ల హీరోయిన్ పూన‌మ్ కౌర్ ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌, పూన‌మ్ గురించి క‌త్తి మ‌హేష్ సంధించిన ప్ర‌శ్న‌లు, వాటికి స్పంద‌న‌గా పూన‌మ్ చేసిన ట్వీట్లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ వివాదం ఎలాగోలా స‌ద్దుమ‌ణిగింది. తాజాగా పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.

`డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవ‌స‌రాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి?` అంటూ పూన‌మ్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ త‌మ హీరో ప‌వన్‌ను ఉద్దేశించే పూన‌మ్ చేసింద‌ని అభిమానులు రెచ్చిపోయారు. పూన‌మ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో పూన‌మ్ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఆ ట్వీట్ ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ చేసింది కాద‌ని, డ‌బ్బు కోసం ఓ కూతుర్ని అమ్ముకున్న తండ్రిని ఉద్దేశించి ఆవేద‌న‌గా చేసిన ట్వీట్ అని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories