కోదాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కోదాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
x
Highlights

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు...

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా స్థానికలు సహయంతో క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యే కాలంలో నల్గొండ మార్గంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంపై ఇక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories