జగన్ పై దాడి కేసు నిందితుడికి అస్వస్థత..!

జగన్ పై దాడి కేసు నిందితుడికి అస్వస్థత..!
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హ‌త్యా య‌త్నం కేసులో నిందితుడు అయిన జ‌నుప‌ల్లి శ్రీనివాస రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా శ్రీనివాస్...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హ‌త్యా య‌త్నం కేసులో నిందితుడు అయిన జ‌నుప‌ల్లి శ్రీనివాస రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా శ్రీనివాస్ అస్వస్థతకు లోనయ్యాడు. జ‌గ‌న్‌పైన కోడిక‌త్తితో దాడికి దిగిన శ్రీనివాస్ రావు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. శ్రీనివాస్ కు టైపాయిడ్ జ్వరం రావడంతో సెంట్రల్ జైల్ పోలీసులు అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండ్రోజులుగా శ్రీనివాస్‌కి వైద్య చికిత్సలు అందించారు. రెండ్రోజుల తరువాత శ్రీనివాస్ ఆరోగ్యం మేరుగుపడటంతో శ్రీనివాస్ ఆస్పత్రినుండి మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. అయితే శ్రీనివాస్‌కు పెద్దగా ప్రమాదమేమీ లేదని టైపాయిడ్, మలేరియా సోకడంతో మేరుగైన చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లదించారు. ఇప్పుడు శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నిర్దారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories