ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వైయస్ జగన్..

ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వైయస్ జగన్..
x
Highlights

వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(ఫిబ్రవరి 4) కేంద్ర ఎన్నికల సంగం చీఫ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు,...

వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(ఫిబ్రవరి 4) కేంద్ర ఎన్నికల సంగం చీఫ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

జగన్ తో పాటుగా ముఖ్యనేతలు బొత్స సత్యనారాణయన, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి, మేకపాటి, అలాగే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలను కలుపుకుని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories