తలసేమియా కేర్ సెంటర్‌‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

తలసేమియా కేర్ సెంటర్‌‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
x
Highlights

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తలసేమియా కేర్ సెంటర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం తలసేమియా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆమె...

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తలసేమియా కేర్ సెంటర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం తలసేమియా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆమె సత్కరించారు. తలసేమియా బాధితులు రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 80 మంది బాధితులను ఎన్టీఆర్ ట్రస్ట్ దత్తత తీసుకుందని ఆమె స్పష్టంచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తోందని అన్నారు నారా భువనేశ్వరి. వరల్డ్ బ్లడ్ డోనర్‌ డే సందర్భంగా ప్రతీ ఒక్కరూ రక్త దానం చేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. అధికారంతో సంబంధం లేకుండానే సేవ చేస్తామన్నారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఎలాంటి సహాయం పొందలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పారదర్శకంగా సేవా కార్యక్రమాలు చేస్తుందని అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories