95 లోక్‌సభ స్థానాల్లో పూర్తయిన పోలింగ్‌.. శ్రీనగర్‌ లో ఘోరం..

95 లోక్‌సభ స్థానాల్లో పూర్తయిన పోలింగ్‌.. శ్రీనగర్‌ లో ఘోరం..
x
Highlights

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్‌ నమోదయింది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషన్‌...

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్‌ నమోదయింది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషన్‌ అధికారికంగా తెలిపింది. పశ్చిమబెంగాల్, మణిపూర్‌లలో మినహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా ముగిసినట్టు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈవీఎంలలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గురువారం తమిళనాడులోని 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, యూపీ, అస్సాం, బిహార్, ఒడిశాలలో ఐదేసి సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో మూడు చొప్పున, జమ్మూకశ్మీర్‌లో రెండు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానం, ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి.

ఇందులో పుదుచ్చేరిలో అత్యధికంగా 80%, మణిపూర్‌లో 75% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం నమోదు చూస్తే.. తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాల్లో 63.73% పోలింగ్‌ నమోదైంది. అలాగే 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 67% పోలింగ్‌ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లోని మూడు సీట్లకు జరిగిన ఎన్నికలో 76% ఓటింగ్‌ నమోదైంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68.37% నమోదయింది. బిహార్‌లో 62.52%, యూపీలో 62.30%, అస్సాంలో 73.32% నమోదైంది. కశ్మీర్‌ శ్రీనగర్‌లో అత్యల్పంగా 14.8% పోలింగ్‌ నమోదైంది. శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానంలోని 90 పోలింగ్‌ బూత్‌లతో ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories