బ్రేకింగ్: ఎన్‌డి తివారీ తనయుడి ఆకస్మిక మృతి

బ్రేకింగ్: ఎన్‌డి తివారీ తనయుడి ఆకస్మిక మృతి
x
Highlights

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్‌డి తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ మంగళవారం మరణించారు. 39 ఏళ్ల రోహిత్ శేఖర్ ఆకస్మిక మృతికి కారణం ఏమిటనేది తెలియలేదు....

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్‌డి తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ మంగళవారం మరణించారు. 39 ఏళ్ల రోహిత్ శేఖర్ ఆకస్మిక మృతికి కారణం ఏమిటనేది తెలియలేదు. అయితే రోహిత్ శేఖర్ ను హుటాహుటిన స్థానిక మాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించగా, రోహిత్ అప్పటికే రోహిత్ శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా రోహిత్ మృతిని దక్షిణ ఢిల్లీ డీఎస్పీ విజయ్‌కుమార్ ధ్రువీకరించారు. రోహిత్ శేఖర్ ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే తివారీ తన తండ్రే అని కొద్దిరోజులుగా రోహిత్ న్యాయపోరాటానికి దిగారు. అయితే రోహిత్ ఆరోపణలను తీవ్రంగా తివారీ ఖండిస్తూ వచ్చారు. కాగా 2014లో కోర్టులో వ్యాజ్యం పడటం, డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత తివారీ రోహిత్ తన కొడుకేనంటూ ఒప్పుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories