అమెరికా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో తానా 22వ మహాసభలు నిన్న (గురువారం) ప్రారంభమయ్యాయి. మూడో రోజు కార్యక్రమంలో...
అమెరికా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో తానా 22వ మహాసభలు నిన్న (గురువారం) ప్రారంభమయ్యాయి. మూడో రోజు కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనే అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సభకు నన్ను ఆహ్వానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకు జీవితంలో పెద్ద కోరికలు ఏమీ లేవు. సమస్యల్లో ఉన్న ప్రజలకు సాయం చేయడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. ఆ ఉద్దేశంతోనే రాజకీయా రణరంగంలోకి అడుగు పెట్టానన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి గురించి తాను ఎక్కడా మాట్లాడింది లేదని తొలిసారిగా మీ ముందు నా మనసులోని మాటను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నారు.
ఏపీలో జనసేన పార్టీ పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెట్టాను. పెద్ద పెద్ద రాజకీయ నేతలందరూ ధైర్యంగా సమస్యల గురించి మాట్లాడక పోవడం చాలా ఆశ్చర్యమేసేది అని, పదవుల కోసం, విజయం గురించి ఆలోచించి జనసేనే పార్టీ పెట్టలేదు. యువత గొంతులో ఉన్న ఆవేదనను నా పైపు నుంచి చెప్పాలనుకున్నాను. నేను స్కాములు, ద్రోహాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. విలువలు కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire