రాజు గారి గదిలో మిల్కీ బ్యూటీ

రాజు గారి గదిలో మిల్కీ బ్యూటీ
x
Highlights

'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లలో ఒకరిగా మారిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్య వరుస పెట్టి సినిమాలను ఆక్సెప్ట్ చేస్తున్న ఈమె...

'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లలో ఒకరిగా మారిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్య వరుస పెట్టి సినిమాలను ఆక్సెప్ట్ చేస్తున్న ఈమె ఈ మధ్యనే సందీప్ కిషన్ తో కలిసి 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈమె త్వరలో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజా సమాచారం ప్రకారం తమన్నా ఒక హారర్ కామెడీ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 'రాజు గారి గది 3' సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు ఓంకార్.

ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొంతకాలంగా వెతుకుతూ ఉన్న ఓంకార్ ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఓంకార్ తమన్నా కోసం ముంబై వెళ్లి మరీ స్క్రిప్ట్ ను నెరేట్ చేసి వచ్చాడట. ఇంతకు మునుపెన్నడూ తమన్నా అలాంటి పాత్ర చేయలేదు కాబట్టి ఆమె కూడా వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా కాల్షీట్ల విషయమై చర్చ జరుగుతోంది. ఒక వారంలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories