వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసుల నోటీసు

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసుల నోటీసు
x
Highlights

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త...

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈనెల 6న విచారణ కోసం గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు నోటీసులో కోరారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories