బాలకృష్ణతో విబేధాలు లేవు . ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ క్లారిటీ

బాలకృష్ణతో విబేధాలు లేవు . ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ క్లారిటీ
x
Highlights

తెలుగు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ తర్వాత అంత ముక్కుసూటిగా మాట్లాడేది అంటే కేవలం తేజ మాత్రమే . ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం...

తెలుగు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ తర్వాత అంత ముక్కుసూటిగా మాట్లాడేది అంటే కేవలం తేజ మాత్రమే . ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత .బెల్లకొండ సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు . సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . అయితే దీనిపైన అయన మీడియాతో మాట్లడారు .

ఈ సినిమా కంటే ముందు అయన ఎన్టీఆర్ బయోపిక్ ని తీయాలని అనుకున్నారు . కొన్ని అనివార్య కారణాల వల్ల అయన అ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు . తరవాత అ ప్రాజెక్ట్ ని క్రిష్ డీల్ చేసాడు . అయితే అయన తప్పుకోవడం పై తేజ వివరణ ఇచ్చారు . ఎన్టీఆర్ గొప్ప నటుడు, నాయకుడు. నేను ఇష్టపడే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్. ఎంజీఆర్. అలాంటి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమాకు న్యాయం చేయలేనని అనిపించింది. ఎన్టీఆర్‌ను గొప్పగా చూపించే స్టామినా నాకు లేదనిపించింది. అందుకే తప్పుకొన్నాను అని తేజ అన్నారు.

తేజ ఈ సినిమా నుండి బయటకు వచ్చిన తరవాత బాలకృష్ణ కి మరియు ఆయనకి మధ్య విబేధాలు వచ్చాయి అందుకే అయన సినిమా నుండి బయటకు వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి . దీనిపైన కూడా డైరెక్టర్ తేజ క్లారిటీ ఇచ్చారు . ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత కథ‌ను లోతుగా పరిశోధన చేశాను. అప్పుడు ఎన్టీఆర్‌కు న్యాయం చేయలేనని అనిపించింది. అంతేకాని బాలకృష్ణతో విభేదాలు రావడం వల్ల బయటకు వచ్చాననే వార్త అబద్ధం. నా వ్యక్తిగత ఆలోచనల ప్రకారమే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను అని తేజ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories