లోయలో పడ్డ బస్సు..ఆరుగురి మృతి

లోయలో పడ్డ బస్సు..ఆరుగురి మృతి
x
Highlights

జమ్ముకశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ్‌కోట్‌ వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. కాగా ఈ ఘటనలో...

జమ్ముకశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ్‌కోట్‌ వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. కాగా ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు విడిచారు. కాగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మృతిచెందారు. ఆదివారం అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి తీవ్రవిషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories