జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలి: చంద్రబాబు

జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలి: చంద్రబాబు
x
Highlights

జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలన్నారు చంద్రబాబు. పెన్షన్లను 3వేలకు పెంచుతామన్న బాబు ప్రతి ఏటా పసుపు కుంకుమ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని పదవికి...

జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలన్నారు చంద్రబాబు. పెన్షన్లను 3వేలకు పెంచుతామన్న బాబు ప్రతి ఏటా పసుపు కుంకుమ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని పదవికి మోడీ అనర్హుడంటూ నిప్పులు చెరిగిన చంద్రబాబు ప్రత్యేక హోదాకి మద్దతిస్తామని కేసీఆర్ ఏమైనా జగన్‌కు చెప్పాడా అంటూ ప్రశ్నించారు. జగన్‌‌‌కు ఒక్కఛాన్స్‌ ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని, తనను చూసే టీడీపీకి ఓటేయాలని ప్రజలను కోరారు చంద్రబాబు. ప్రధాని మోదీకి ఓటేస్తే మరణశాసనాన్ని మీరే రాసుకున్నట్లని, మోదీ వస్తే దేశంలో ముస్లింలు బతకలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఎన్నికలు భావితరాల భవిష్యత్‌కు సంబంధించినవన్నారు.

నన్ను చూసి ఓటేయండి మీకు అండగా ఉంటానని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పాలి. వైసీపీకి ఓటేస్తే నేరుగా మోదీ అకౌంట్‌లోకి వెళ్లిపోతుందన్నారు చంద్రబాబు. అసలు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అడుగుతున్నారని, ఒక్క ఛాన్స్‌ అని కరెంట్‌ తీగలు పట్టుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క ఛాన్సే కదా అని విషం తాగుతామా అని మరోసారి చంద్రబాబు ప్రశ్నించారు. రైతులను అన్నివిధాలా ఆదుకున్నాం అని అన్నారు. పెళ్లి కానుక, బీమా, వైద్య సేవ నగదు పెంచాం అని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories