చిన్నారి అపహరణ కథ సుఖాంతం...అమ్మ ఒడి చేరిన చిన్నారి

చిన్నారి అపహరణ కథ సుఖాంతం...అమ్మ ఒడి చేరిన చిన్నారి
x
Highlights

కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతమైంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి...

కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతమైంది. బీదర్‌లో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కోఠి ఆస్పత్రిలో తల్లికి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప తల్లి ఒడికి చేరడంతో కుటుంసభ్యులు పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పాప కథ సుఖాంతమైంది. పాప తల్లిదండ్రులు చెంతకు చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పాప ఎక్కడ ఉందోనని ఆందోళన వ్యక్తం చేస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి పాప ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

ఆరేళ్ల తర్వాత పాప ఫుట్టిందని సంతోషంలో ఉన్న కుటుంబానికి కిడ్నాప్ రూపంలో వచ్చిన ఆపదన విషాదం నింపింది. అయితే కిడ్నాప్ కు గురైన పాపను ఓ మహిళ హైదరాబాద్‌లో ఎంజీబీఎస్‌లో బీదర్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చి బీదర్‌ పోలీసులను అలర్ట్ చేశారు. ఏసీపీ చేతన నేతృత్వంలో పది బృందాలుగా విడిపోయిన పోలీసులు బీదర్‌కు వెళ్లి రెండో తేదీ రాత్రంతా స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మాయలేడి ఫొటోలను పలు పోలీస్‌స్టేషన్లకు పంపి అప్రమత్తం చేశారు.

కోఠి ప్రభుత్వాసుపత్రిలో పాపను కిడ్నాప్‌ చేసిన కిడ్నాపర్‌ బీదర్‌ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శిశువుని వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును స్వాధీనం చేసుకున్న బీదర్ పోలీసులు ప్రాథమికంగా వైద్య సేవలు అందించారు. తల్లిఒడిలో ఉండాల్సిన పసికందుకు సకాలంలో తల్లిపాలు అందకపోవడంతో నీరసించిపోయింది. సకాలంలో ఆహారం అందకపోవడంతో అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పిన తర్వాత హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

బీదర్‌ నుంచి పాపను ప్రత్యేక వాహనంలో కుటుంబసభ్యుల సమక్షంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కోటి ఆస్పత్రిలో కుటుంబసభ్యుల సమక్షంలో పాపను తల్లికి అప్పగించారు హైదరాబాద్‌ పోలీసులు. పాపను చూసిన తల్లి ఆనందానికి అవధులు లేకుండాపోయాయ్. చిన్నారి తన పొత్తిళ్ల చేరడంతో పాపను చూసి ఆనందంతో ముద్దాడింది ఆ తల్లి. దీంతో చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పాప ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన మీడియాకు పాప తండ్రి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళను బీదర్‌‌లో కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమె వెళ్లిన వాహనాన్ని గుర్తించిన పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మహిళను పట్టుకున్నారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేసిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories