"అతను, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు" అన్న ఎన్టీఆర్

అతను, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అన్న ఎన్టీఆర్
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వారాల...

ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వారాల క్రితం విడుదలైన మొదటి ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రేక్షకులు ఇంకా ఈ చిత్రం మొదటి ట్రైలర్ గురించే మాట్లాడుకుంటూ ఉండగా రాం గోపాల్ వర్మ రెండవ ట్రైలర్ ను విడుదల చేసాడు. మొదటి ట్రైలర్ లాగానే ఈ వీడియోలో కూడా నారా చంద్రబాబు నాయుడు మరియు దగ్గుబాటి పురందేశ్వరి లు విలన్లు గా కనిపించారు.

సొంత పార్టీ లో ఎన్టీఆర్ ఎదుర్కొన్న అసమ్మతి, చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఓట్టు వేయడం, లక్ష్మీపార్వతిని అడ్డుకుంటానని చెప్పటం, లక్ష్మీపార్వతి ని దగ్గుపాటి పురందేశ్వరి అసహ్యంగా తిట్టడం, ఇక ఆఖరి రోజుల్లో ఎన్టీఆర్ పడ్డ మనోవేదన ఇలాంటివి మళ్ళీ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక సినిమా నుంచి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తారో అవన్నీ ఉన్నాయని ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. రాంగోపాల్ వర్మ మరియు అగస్త్య మను కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి మూడో వారంలో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories