తెలంగాణ ఎన్నికల బరిలో నందమూరి కుటుంబం

x
Highlights

కూకట్ పల్లి బరిలో నందమూరి ఫ్యామిలీ దిగబోతున్నారా....? సెటిలర్లు ఎక్కువగా ఉండే ఆ స్థానంపై టీడీపీ కన్నేసిందా...? నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్...

కూకట్ పల్లి బరిలో నందమూరి ఫ్యామిలీ దిగబోతున్నారా....? సెటిలర్లు ఎక్కువగా ఉండే ఆ స్థానంపై టీడీపీ కన్నేసిందా...? నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయనున్నారా...? దీనిపై చంద్రబాబు వద్ద నేతలు చర్చించారా...?

కూకట్‌పల్లి టీడీపీ టికెట్‌ ఎవరికి దక్కుతుందన్న విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ స్థానం కాంగ్రెస్‌కా, టీడీపీకా అన్న ఉత్కంఠ ఇంతకాలం కొనసాగగా, చివరికి టీడీపీకి సీటు కేటాయించారు. అయితే, టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. టీడీపీకి కంచుకోట కూకట్ పల్లి నియోజకవర్గం. అక్కడ ఉన్న సెటిలర్స్ ఓట్లు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తోంది.

అక్కడి నుంచి మొదట నందమూరి కల్యాణ్ రామ్ పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్ది రెడ్డి అక్కడ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన అక్కడ ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. కల్యాణ్ రామ్ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో సుహాసిని వైపు నేతలు మొగ్గు చూపారు. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్య సుహాసిని. సుహాసిని పోటీ విషయమై అధినేత చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories