ఆ భావంతోనే ఆయనను సీఎం చేశారు: దేవినేని

ఆ భావంతోనే ఆయనను సీఎం చేశారు: దేవినేని
x
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వందకు వెయ్యి శాతం టీడీపీదే విజయమన్నారు మంత్రి దేవినేని ఉమ. టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని తాము...

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వందకు వెయ్యి శాతం టీడీపీదే విజయమన్నారు మంత్రి దేవినేని ఉమ. టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని తాము ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నామన్నారు. వైసీపీ అభ్యర్థులతో సమావేశం కూడా నిర్వహించలేక జగన్ లోటస్ పాండ్‌కే పరిమితం అవుతున్నారని విమర్శించారు దేవినేని ఉమా. మే 23 తరువాత తిరిగి అధికారం చేపట్టేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి దేవినేని ఉమ. 23న వెలువడే ఫలితాలతో తాము ఆంధ్రాలో సంబరాలు చేసుకుంటామని దేవినేని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో తమకు సంబంధం లేదన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు తమ పక్షానే ఉన్నారని దేవినేని ఉమ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఏం చూసి ప్రజలు ఓటేస్తారని అన్నారు.గత 2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటేసి గెలిపించారని, చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే భావంతోనే చంద్రబాబును ఏపీ సీఎం చేశారని దేవినేని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories