అల్లుఅర్జున్ స్థానంలో బరిలోకి దిగిన ఎంఎస్ ధోని

అల్లుఅర్జున్ స్థానంలో బరిలోకి దిగిన ఎంఎస్ ధోని
x
Highlights

దాదాపుగా అందరు స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బ్రాండ్లకు అంబాసిడర్ గా మారి యాడ్స్ తో కొన్ని రాళ్లు వెనకేస్తూ ఉంటారు. అందులో మహేష్...

దాదాపుగా అందరు స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బ్రాండ్లకు అంబాసిడర్ గా మారి యాడ్స్ తో కొన్ని రాళ్లు వెనకేస్తూ ఉంటారు. అందులో మహేష్ బాబు తర్వాత చెప్పుకోవాల్సిన పేరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దే. గత కొంతకాలంగా అల్లు అర్జున్ రెడ్బస్ పోర్టల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశాడు. ఆ బ్రాండ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లలో సైతం కనిపించాడు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ ప్రకటన లో ఎంఎస్ ధోని కనిపించటం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఈ డీల్ మూడు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంటుంది. మరి అలాంటిది ఈ అవకాశాన్ని ఎందుకు బన్నీ వదులుకున్నాడు అని కొందరు అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

బన్నీ కావాలనే సినిమాల షూటింగ్ వల్ల సమయం లేకపోవడం వల్లనే బ్రాండ్ ప్రకటనలు నుంచి తప్పుకున్నాడా లేక కావాలనే బ్రాండ్ వారు బన్నీ బదులు ఎంఎస్ ధోని బరిలోకి దింపారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరేమో ఎమ్మెస్ ధోనీ అయితే జాతీయ స్థాయిలో మార్కెట్ ను విస్తరించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే రెడ్ బస్ ఇలా చేసిందని వాదిస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే అల్లు అర్జున్ డైరీలో అసలు ఖాళీ లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఈ మధ్యనే లాంచ్ చేశారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా లో కనిపించబోతున్నాడు.





Show Full Article
Print Article
Next Story
More Stories