130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మరుసటి రోజే చంద్రబాబు..

130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మరుసటి రోజే చంద్రబాబు..
x
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు. 130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని...

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు. 130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఈవీఎంలు సరిగా పనిచేయలేదని అంటున్నారని గుర్తుచేశారు. బాబు మాటలపై ఆయనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ , ఆర్థిక వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు ధర్మాన ప్రసాదరావు. ఓటమి భయంతో ఎన్నికల కమిషన్‌పై బాబు నిందలు మోపడం భావ్యం కాదని చెప్పారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించి అందరి మన్నలు పొందిందని కొనియాడారు. కాగా గత ఎన్నికల్లో ఈవీఎంలను తప్పుపట్టని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఇప్పుడు ఈవీఎలంపై అనుమానం వ్యక్తం చేయడం హాస్యాస్పదమన్నారు. అసలు అప్పుడు లేని అనుమానం ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో జరిగే ఎన్నికలు ఆక్షేపణకరమైనవి కావని, ఎన్నో ఏళ్లుగా సజావుగా జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories