ఇసుక తుపాను బీభత్సం

ఇసుక తుపాను బీభత్సం
x
Highlights

కొంతకాలంగా రాజస్థాన్‌లో ఇసుక తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన చురు పట్టణంపై ఇసుక తుపాను విజృంబించింది. మేఘాలను...

కొంతకాలంగా రాజస్థాన్‌లో ఇసుక తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన చురు పట్టణంపై ఇసుక తుపాను విజృంబించింది. మేఘాలను తాకుతుందా అనిపిస్తూ భారీగా ఇసుక దుమ్ముగా మారి తుపానుగా దూసుకువచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తుపానులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పంటలకు మాత్రం నష్టం వాటి ల్లింది. ఐతే, సినిమాల్లో చూపించినట్లుగా భయంకరంగా ఇసుక తుపాను కమ్మేయడంతో ప్రజలు వణికిపోయారు. ఆన్ లైన్‌లో ఆ వీడియో చూస్తే, అదేదో గ్రాఫికల్ జిమ్మిక్ అనిపించవచ్చు. కానీ, అది నిజంగా జరిగిందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories