టీ-20ల్లో ధోనీ రికార్డుల మోత

టీ-20ల్లో ధోనీ రికార్డుల మోత
x
Highlights

శ్రీలంకతో భువనేశ్వర్ బారాబటీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ మహేంద్రసింగ్ ధోనీ షోగా ముగిసింది. ధోనీ బ్యాట్స్ మన్ గా మాత్రమే కాదు వికెట్...

శ్రీలంకతో భువనేశ్వర్ బారాబటీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ మహేంద్రసింగ్ ధోనీ షోగా ముగిసింది. ధోనీ బ్యాట్స్ మన్ గా మాత్రమే కాదు వికెట్ కీపర్ గా సైతం రికార్డుల మోత మోగించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ 39 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ గా రెండు క్యాచ్ లు, రెండు స్టంపింగ్స్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. టీ-20 క్రికెట్లో అత్యధికంగా 74 మందిని క్యాచ్ లు లేదా స్టంపౌట్లు సాధించిన తొలివికెట్ కీపర్ గౌరవాన్ని సైతం ధోనీ సొంతం చేసుకొన్నాడు. ఒకే మ్యాచ్ లో 39 పరుగుల స్కోరుతో పాటు నాలుగు అవుట్లు సాధించడం ద్వారా ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories