ఆరో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మోడీ సర్కార్ ఈ ఐదేళ్లలో సుస్థిరపాలన అందించాం 2020 నాటి సుస్థిర భారత్ స్థాపిస్తాం జీడీపీ వృద్దిరేటు గణనీయమైన...
ఆరో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మోడీ సర్కార్
ఈ ఐదేళ్లలో సుస్థిరపాలన అందించాం
2020 నాటి సుస్థిర భారత్ స్థాపిస్తాం
జీడీపీ వృద్దిరేటు గణనీయమైన అభివృద్ధి సాధించాం
రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే లక్ష్యం
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగాం
దేశప్రజలందరికీ ఇళ్లు కట్టించాలన్న లక్ష్యంతో ఉన్నాం
మా హయాంలోనే ధరలను భారీగా తగ్గించగలిగాం
ఎఫ్డీఐ విధానాన్ని సరళీకృతం చేయగలిగాం
మా హయాంలో 239 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి
ద్రవ్యోల్బణం తగ్గింది మా హయాంలోనే
మనది ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక దేశం
ప్రభుత్వరంగ బ్యాంకులకు 2.6 లక్షల కోట్ల మూలధనం అందించాం
బ్యాంకుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆర్బీఐని కోరాం
3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం
బ్యాంకింగ్ రంగంలో 4 ఆర్ సాధించగలిగాం
అవినీతి రహిత పాలన మోడీ సర్కార్ అందించాం
సుస్థిర అభివృద్ధి కోసం పటిష్టమైన పునాదులు వేయగలిగాం
స్వచ్ఛ్ భారత్తో దేశ ప్రజల ప్రవర్తనల్లో మార్పు తెచ్చాం
ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రవాణా సౌకర్యం కల్పించాం
60 వేల కోట్లు ఉపాధిః హామీ పథకానికి కేటాయించాం
అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాం
అందరికీ ఆహారధాన్యాలను అందుబాటులో ఉంచాం
భారత్ ఇమేజ్ ప్రపంచంలో ఎంతో పెరిగింది
ఆయుష్మాన్ భారత్తో 50 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపాం
5.45 లక్షల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నివారించగలిగాం
నాలుగేళ్లలో 1.53 లక్షల గృహాలను పేదలకు అందించాం
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచించాం
కరెంటు బిల్లుల తగ్గింపునకు ఎల్ఈడీలను అందుబాటులోకి తెచ్చాం
1,70 లక్షల కోట్ల రూపాయలతో పేదలకు ఆహారాన్ని అందించాం
కేంద్రంలో రైతుబంధులాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం
చిన్న సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్ పథకం
రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6వేలు పంటసాయం
రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు
నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది
దీని వల్ల 12కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది
2018 డిసెంబర్ నుంచే ఈ పథకం అమలు
మొదటి విడతగా రూ.2వేలు తక్షణమే ఇస్తాం
మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ
గోవుల సంతతి పెంచడానికి కామధేను పథకం
కామధేను పథకానికి రూ.750కోట్లు
గోరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం
ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు చేస్తాం
పశు, చేపల పెంపకం రైతులకు రెండు శాతం వడ్డీ సబ్సిడీ
ప్రకృతి వైపరీత్యాల బాధిత రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ
సకాలంలో రుణాలు చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డీ రాయితీ
జీడీపీలో 42శాతం శ్రామికుల నుంచే వస్తోంది
ప్రధానమంత్రి శ్రమ్ జ్యోతి మాన్ధన్పేరుతో కొత్త పెన్షన్
కనీస పెన్షన్ రూ.3వేలు
18 ఏళ్లు దాటినవారు నెలకు రూ.55 ... 39 ఏళ్లు దాటిన వారు నెలకు రూ.100 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో పెన్షన్ ఫండ్కు జమ
గ్రాట్యుటీ రూ.20లక్షలకు పెంపు
కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు
ముద్ర స్కీం కింద రుణాలకు రూ.7 లక్షల కోట్లు
గ్రాట్యుటీ పరిధి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు
మహిళల నేతృత్వంలో మహిళాభివృద్ధి జరుగుతోంది
గ్రామీణ మహిళల సామాజిక పరిస్థితులు మెరుగుపరుస్తాం
ఇప్పటికే 6కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, 8కోట్లకు పెంచుతాం
స్టార్టప్స్లో దేశం రెండోస్థానంలో ఉంది
2019-20లో రక్షణ బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతుంది...అవసరమైతే మరిన్ని నిధులిస్తాం
ప్రపంచంలోనే అత్యధిక హైవేలున్న దేశం మనది
దశాబ్దాలుగా అగిపోయిన హైవేలు మేం పూర్తి చేశాం
రైల్వేలు బాగా మెరుగుపర్చాం
కాపలా లేని లెవల్ క్రాసింగ్లే లేవు
వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కుతుంది
మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం
బ్రాడ్ గేజ్లో కాపలా లేని గేట్లను తొలగించాం
మొబైల్ డేటా వినియోగం 50రెట్లు పెరిగింది
వాయిస్కాల్ ఖర్చు మనదేశంలో అతితక్కువ
సౌరశక్తి ఉత్పత్తి 10రెట్లు పెరిగింది
లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి
రైల్వే క్యాపిటిల్ ఔట్ లే రూ.64,500కోట్లు
ఈఎస్ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు
ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తాం
24గంటల్లో ఆదాయపన్ను రీఫండ్ వచ్చేలా చూస్తాం
ఆన్లైన్ వ్యవస్థను పటిష్టం చేస్తాం
రాష్ట్రాల పన్నుల వృద్ధిరేటు తగ్గితే లోటు కేంద్రం పూరిస్తుంది
ప్రత్యక్ష పన్నుల రాబడి 6.38లక్షల కోట్లకు పెరిగింది
2013-14నాటితో పోల్చితే దాదాపు రెట్టింపయింది
వచ్చే ఐదేళ్లలో మనది 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుంది
ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్లవుతుంది
ఈజ్ ఆఫ్ లివింగ్ను మెరుగుపర్చేందుకు మౌలికసదుపాయాలు కల్పిస్తాం
సినిమా థియేటర్లపై జీఎస్టీ 12శాతానికి తగ్గింపు
భారత్లో తీసే సినిమాలకు సింగిల్ విండో క్లియరెన్స్
ఎలక్ట్రికల్ కార్ల తయారీకి, అమ్మకాలకు ప్రోత్సాహం
చమురు వాడకం తగ్గితే దిగుమతులు తగ్గుతాయి
ఆర్థికభారం తగ్గుతుంది కాబట్టి ఆదిశగా చర్యలు
మేకిన్ ఇండియాలో భాగంగా ఆటో మొబైల్స్, డిఫెన్స్ రంగాలకు పోత్సాహకాలు
2022 నాటికి అంతరిక్షంలోకి మానవుడిని పంపే గగన్యాన్ పథకం
కనిష్ఠ ప్రభుత్వ జోక్యంతో గరిష్ఠ పాలన అందిస్తాం
జాతీయ విద్యా స్కీమ్కు రూ.38,570కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 76,800కోట్లు
ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166కోట్లు కేటాయింపు
రూ.5లక్షల వరకు పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు
పీఎఫ్ ఇతర సేవింగ్స్ స్కీమ్లలో ఇన్వెస్ట్ చేసేవారికి రూ.6.5లక్షల వరకు మినహాయింపు
రెండిళ్లు ఉన్నప్పటికీ అద్దెపై పన్ను మినహాయింపు
స్టాండెడ్ డిడక్షన్ రూ.50వేలకు పెంపు
3కోట్ల మంది మధ్యతరగతి వర్గాలకు ఊరట
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire