నవరత్నాల అజెండా..ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

నవరత్నాల అజెండా..ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, పారదర్శక...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, పారదర్శక పాలనే లక్ష్యంగా ఈ సదస్సులో కలెక్టర్లకు జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌‌, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌‌,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో నేడు ఆరు అంశాలపై జగన్ చర్చించనున్నారు. తొలి రోజు కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయానికి వెళ్లనున్నారు. పాలనపరమైన కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. దీంతో పాటు ఈ రోజు రాత్రి IASలకు సీఎం వైఎస్‌‌ జగన్‌‌ విందు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories